యాజమాన్యం వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 7 |
యాజమాన్యం వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ చౌదరిగూడ: యాజమాన్య వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పుంటిచ్చుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండల పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే యువకుడు లాల్ పహాడ్ పరిధిలోని బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే ఆ యువకుడు పరిశ్రమ యాజమాన్యం వేదింపుల వల్ల ఆత్మహత్య యత్ననికి పాల్పడుతున్నట్లు వాయిస్ రికార్డ్ పెట్టీ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ప్రస్తుతం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నాడు. కాగా.. గత చాలా కాలంగా పరిశ్రమ యాజమాన్యం కార్మికులను బయ బ్రంతులకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని తోటి కార్మికులు సైతం ఆరోపిస్తున్నారు.



Read More......


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Next Story

Most Viewed